కరెంటు బండ్ల ప్రమోషన్ కోసం గోవాలో మీటింగ్

కరెంటు బండ్ల ప్రమోషన్ కోసం గోవాలో మీటింగ్

న్యూఢిల్లీ: దేశంలో కరెంటు బండ్ల వినియోగం పెంచేందుకు ఈ నెల 4 వ తేదీన గోవాలో కాన్ఫరెన్స్​​ పెడుతున్నట్లు హెవీ ఇండస్ట్రీస్​ మినిస్ట్రీ వెల్లడించింది. ఈ కాన్ఫరెన్స్​లో గవర్నమెంటు ఆఫీసర్లు, ఇండస్ట్రీ లీడర్లు, స్టార్ట్​అప్స్​ఓనర్లు అందరూ పాల్గొంటారని పేర్కొంది. దేశంలో మరింత వేగంగా కరెంటు బండ్ల వాడకం పెరిగేందుకు ఏం చేయాలనేది ఈ కాన్ఫరెన్స్​లో చర్చించనున్నట్లు వివరించింది. ఎలక్ట్రిక్​ వెహికల్స్​ మాన్యుఫాక్చరింగ్​, బ్యాటరీలు, హైటెక్​ ఆటో కాంపోనెంట్స్​ తయారీ రంగాలలోకి పెద్ద ఎత్తున ఇన్వెస్ట్​మెంట్లు తెచ్చుకోవడంపైనా కాన్ఫరెన్స్​ ఫోకస్​ పెట్టనుంది. హెవీ ఇండస్ట్రీస్​ మినిస్టర్​ మహేంద్ర నాథ్​ పాండే చీఫ్​ గెస్ట్​గా కాన్ఫరెన్స్​లో పాల్గొంటారు. వివిధ రాష్ట్రాల ట్రాన్స్​పోర్ట్​ మినిస్టర్లు, చీఫ్​ సెక్రటరీలు, సీనియర్​ ఆఫీసర్లు, కంపెనీల ప్రతినిధులు, టెక్నికల్​ ఎక్స్​పర్టులు కూడా కాన్ఫరెన్స్​లో పార్టిసిపేట్​ చేయనున్నారు. దేశపు జీడీపీలో 6.4 శాతం ఆటోమొబైల్​ ఇండస్ట్రీ నుంచి వస్తోంది. మాన్యుఫాక్చరింగ్​ జీడీపీలోనైతే ఏకంగా35 శాతం ఈ రంగం నుంచే సమకూరుతోంది. ఉపాధి కల్పనలోనూ ఆటోమొబైల్​ సెక్టార్​ ముందుంటోంది. టూ వీలర్లు, త్రీ వీలర్లు, ట్రాక్టర్ల సెగ్మెంట్లలో  మన దేశం ప్రపంచంలోనే టాప్​ పొజిషన్​లో ఉండగా, పాసింజర్​, కమర్షియల్​ వెహికల్స్​ మాన్యుఫాక్చరింగ్​లో మనం అయిదో ప్లేస్​లో నిలుస్తున్నాం.  కాకపోతే గ్లోబల్​ ఆటోమోటివ్​ ట్రేడ్​లో మన దేశపు వాటా మాత్రం రెండు శాతం కంటే తక్కువే. మన ఆటోమొబైల్​ ఎగుమతులు మొత్తం 27 బిలియన్​ డాలర్లు. అడ్వాన్స్​డ్​ ఆటోమోటివ్​ కాంపోనెంట్స్​ ఎగుమతులు ఇప్పుడే ఊపందుకుంటున్నాయి. ఈ ఎగుమతులు 2030 నాటికి 30 శాతానికి పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. కరోనా మహమ్మారి తర్వాత అన్ని దేశాలలోనూ ఈవీలపై ఫోకస్​ పెరిగిందని, క్లైమేట్​ ఛేంజ్​ నేపథ్యంలో కరెంటు బండ్ల వాడకం దేశంలో భారీగా పెరగాల్సిన అవసరం ఉందని హెవీ ఇండస్ట్రీస్​ మినిస్ట్రీ పేర్కొంటోంది. ఫేమ్​ 2 వంటి నేషనల్​ ప్రోగ్రామ్స్, జీఎస్​టీ తగ్గింపు వంటివి​ ఈ దిశలో తీసుకున్న చొరవేనని వెల్లడించింది.