
తెలంగాణ తనకెన్నో మధుర జ్ఞాపకాలను ఇచ్చిందన్నారు మాజీ గవర్నర్ నరసింహన్. మీడియాతో… ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. తొమ్మిదిన్నరేళ్లు తనకు మద్దతుగా నిలిచిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు నరసింహన్. ఉద్యమం సమయంలో తాను తెలంగాణకు వ్యతిరేకమని అసత్య ప్రచారం చేశారన్నారు. ఉద్యమం టైంలో.. అన్ని పార్టీలు సంమయమనం పాటించాయని.. పోలీసులు సమర్ధంగా పనిచేశారని చెప్పారు. ఇక.. ఆలయాలు ఎక్కువగా తిరుగుతున్నారని వచ్చిన విమర్శలు… తననెంతో బాధించాయని చెప్పారు నరసింహన్.