హైదరాబాద్, వెలుగు: జేపీ నడ్డా పేరు ఇదివరకు తాను వినలేదన్న కేటీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ నేత, మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి ఘాటుగా స్పందించారు. ‘‘కేటీఆర్.. మీరు నడ్డాను కలిసిన విషయం మరిచిపోయారా? కొంచెం యాదిచేయాలనుకుంటున్నాను. నడ్డా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఫార్మాసిటీ కోసం రూ. 1500 కోట్లు కావాలని ఆయనను 2016లో మీరు కలిశారు కదా! విభజన చట్టంలో లేకపోయినా బీబీనగర్లో ఎయిమ్స్ను ఆయన సాంక్షన్ చేశారు కదా!” అని ట్వీట్ చేశారు. ‘‘ప్రేమ, కృతజ్ఞతతో ఉండటం మన తెలంగాణ సంస్కృతి. తెలంగాణ ఉద్యమ సమయంలో మీకు, మీ పార్టీకి అండగా నిలిచినవాళ్లను మీరు, మీ పార్టీ సులభంగా మరిచిపోయి ఉండొచ్చు. కానీ.. తెలంగాణ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు” అని కేటీఆర్కు చురకలంటించారు. దీంతోపాటు నడ్డాతో కేటీఆర్ భేటీ అయినప్పటి ఫొటోను, న్యూస్పేపర్లలో వచ్చిన వార్తను, నడ్డాతో సమావేశమైనట్లు అప్పట్లో కేటీఆర్ చేసిన ట్వీట్ను వివేక్ వెంకటస్వామి పోస్టు చేశారు.
Just to remind the forgotten @KTRTRS, your meeting with then Union Health Minister Sri @JPNadda to give a representation seeking his help in sanctioning Rs.1500 crore for setting up Pharma City in Hyderabad. He sanctioned AIIMS Bibinagar, though not mention in the Bifurcation Act pic.twitter.com/OAvzMmvmy5
— Vivek Venkatswamy (@DrGaddamVivek) August 19, 2019