బ్రిటిష్ నాటి సేవలకు గుడ్ బై: పోస్టల్ శాఖలో ఇక ఆ సేవలు బంద్..

బ్రిటిష్ నాటి సేవలకు గుడ్ బై: పోస్టల్ శాఖలో ఇక ఆ సేవలు బంద్..

మీరు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా లెటర్స్ పంపుతున్నారా, అయితే అదే మీ చివరి రిజిస్టర్డ్ పోస్ట్ కావచ్చు. ఎందుకంటే బ్రిటిష్ కాలం నుండి వస్తున్న రిజిస్టర్డ్ పోస్టలను స్పీడ్ పోస్ట్ సర్వీస్‌లో కలపాలని భారత పోస్టల్ డిపార్ట్‌మెంట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి  దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్‌మాస్టర్‌లకు పోస్టల్ డిపార్ట్‌మెంట్ ఒక నోటిస్ పంపి, జూలై 31లోగా అవసరమైన అన్ని పనులు  పూర్తి చేయాలని ఆదేశించింది. దింతో ఎంతోకాలంగా ఉన్న రిజిస్టర్డ్ పోస్ట్ సర్వీస్ ఒక చరిత్రగా మారనుంది. కానీ ముఖ్యమైనవి పోస్ట్ చేయడానికి లేదా   పంపడానికి స్పీడ్ పోస్ట్ అప్షన్ మాత్రమే ఉంటుంది.

 1854లో మొదలైన  రిజిస్టర్డ్ పోస్ట్ :1854లో బ్రిటిష్ రాజ్ లార్డ్ డల్హౌసీ ఇండియా పోస్ట్ ఆఫీస్ చట్టాన్ని అమలు చేసినప్పుడు రిజిస్టర్డ్ పోస్ట్ ప్రారంభమైంది. దీనికి ముందు 1766లో వారెన్ హేస్టింగ్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో కంపెనీ మెయిల్‌ ప్రారంభించారు. ఈ సర్వీస్ 171 సంవత్సరాలుగా ప్రజలకు పేపర్స్  ఇంకా వస్తువులను పంపడానికి ఒక నమ్మకమైన మార్గంగా  ఉండేది. 

ప్రజల సౌకర్యాల కోసమే  నిర్ణయం: ఇప్పుడు కాలం మారిపోయిందని, రిజిస్టర్డ్ పోస్ట్‌ను స్పీడ్ పోస్ట్‌తో కలపడం వల్ల పని మరింత ఈజీ అవుతుంది, కస్టమర్లకు ఇంకా మంచి సౌకర్యాలు లభిస్తాయి. దీని కోసం అన్ని ప్రభుత్వ ఆఫీసులు, కోర్టులు, సంస్థలు జూలై 31లోగ రూల్స్  మార్చుకోవాలని కోరినట్లు పోస్టల్ శాఖ చెబుతోంది. 

 ప్రయోజనాలు ఏంటంటే : స్పీడ్ పోస్ట్‌తో మీ పార్శిల్ ఎక్కడి వరకు చేరిందో ఆన్‌లైన్‌లో చెక్ చేయవచ్చు. రిజిస్టర్డ్ పోస్ట్‌లో ఈ సౌకర్యం లేదు. ఒకటే సర్వీస్ ఉండటం వల్ల పోస్టల్ శాఖ పని ఈజీ అవుతుంది. అలాగే స్పీడ్ పోస్ట్ ద్వారా మీ డెలివరీలు వేగంగా చేరుతాయి. అయితే రిజిస్టర్డ్ పోస్ట్ కంటే కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది.