న్యూఢిల్లీ: బజాజ్ ఫిన్సర్వ్లో భాగమైన బజాజ్ ఫైనాన్స్, పండుగ సీజన్లో వినియోగదారుల లోన్ల జారీలో రికార్డు నమోదు చేసింది. లోన్ వాల్యూమ్లో 27 శాతం, విలువలో 29 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 26 మధ్య కాలంలో బజాజ్ ఫైనాన్స్ సుమారు 63 లక్షల లోన్లు ఇచ్చింది.
ఈ కాలంలో కంపెనీ 23 లక్షల కొత్త కస్టమర్లను చేర్చుకుంది. వీరిలో 52 శాతం మంది కొత్తగా అప్పులు తీసుకున్నవారు. జీఎస్టీ, ఐటీ తగ్గింపు కొనుగోలు శక్తిని పెంచాయి. చాలా మంది ప్రీమియం ఉత్పత్తులకు మారుతున్నట్లు కంపెనీ తెలిపింది. టీవీలు, ఏసీలపై జీఎస్టీ తగ్గించడం వల్ల, లోన్ల సగటు టికెట్ పరిమాణం 6 శాతం తగ్గింది.
హై-ఎండ్ ఉత్పత్తులకు అప్గ్రేడ్ అయ్యేందుకు వీలు కలిగింది. బజాజ్ ఫైనాన్స్ ద్వారా ఫైనాన్స్ అయిన మొత్తం టీవీలలో, 40-అంగుళాలు అంతకంటే ఎక్కువ స్క్రీన్ ఉన్న టీవీల వాటా ఈ ఏడాది 71 శాతానికి పెరిగింది.
