- ఓవర్ స్పీడ్తో దూసుకుపోతున్న వాహనదారులు
- చూసీచూడనట్టు ఉంటున్న అధికారులు
- ఫలితంగా రోడ్డు ప్రమాదాలు.. మరణాలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదం వాహనాల ఓవర్స్పీడ్తో పాటు డ్రైవర్ల నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది. స్పీడ్ నియంత్రణ విషయంలో ఆర్టీఏ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తుండడంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. రవాణా వాహనాలు, స్కూల్ వ్యాన్లు, కాలేజీ బస్సుల ఓవర్ స్పీడ్ను నియంత్రించడానికి తప్పనిసరిగా స్పీడ్ గవర్నర్స్ డివైజ్ను అమర్చాల్సి ఉండగా, ఎక్కడా అమలు కావడం లేదు.
ఈ డివైజ్ ద్వారా వాహనం స్పీడ్ను కంట్రోల్ చేయొచ్చు. గ్రేటర్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 75 శాతం వాహనాలకు స్పీడ్గవర్నర్ డివైజ్ లేదని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. చేవెళ్ల రోడ్డు ప్రమాదం తర్వాత బస్సులు, టిప్పర్లు, ట్యాంకర్లు, స్కూల్, కాలేజీ బస్సులు, వ్యాన్లకు తప్పని సరిగా స్పీడ్ గవర్నర్స్ డివైజ్అమర్చడానికి కసరత్తు చేస్తున్నారు. అలాగే, శివారు ప్రాంతాల్లోనూ, హైవేలపై వెళ్లే వాహనాలకు ఈ డివైజ్లు ఉన్నాయో లేవో చెక్చేస్తున్నారు.
కేంద్ర మోటార్ వాహన చట్టం ఏం చెబుతోందంటే..
గ్రేటర్ మాత్రమే కాకుండా శివారు ప్రాంతాలు, హైవేలపై ప్రయాణిస్తున్న రవాణా వాహనాలకు తప్పనిసరిగా స్పీడ్గవర్నర్ డివైజ్ ఉండాల్సిందేనని సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్-1989, రూల్118 స్పష్టం చేస్తోంది. 2015, నవంబరు,9న తెలంగాణ ప్రభుత్వం రిలీజ్చేసిన నోటిఫికేషన్లోనూ దీన్ని తప్పనిసరి చేసింది.
వాహనాల తయారీదారులే వాహనాలకు డివైజ్లు అమర్చాలని చెప్పింది. తయారీ టైంలో అమర్చక పోతే డీలర్లు అమర్చాలని సూచించింది. భారీ వాహనాల లిమిట్ను 80 కి.మీగా సెట్ చేయాలని పేర్కొన్నది. ఇందులో టూవీలర్స్, ప్యాసింజర్ ఆటోలు, ఫైర్ సర్వీస్ వాహనాలు, అంబులెన్స్, పోలీస్ వాహనాలకు మినహాయింపును ఇచ్చింది. మిగిలిన ట్రాన్స్పోర్ట్ వాహనాలు ముఖ్యంగా బస్సులు, డంపర్ వాహనాలు, ట్యాంకర్లు, స్కూల్బస్సులు, కాలేజీ బస్సులు, టిప్పర్లు 60 కి.మీ దాటకుండా చూడాలని పేర్కొంది.
ఆదేశాలు లైట్ తీస్కున్నరు
తయారీదారులు కానీ, డీలర్లు కానీ యాక్ట్ను గాని, రాష్ట్ర ప్రభుత్వ జీవోను గాని పట్టించుకోవడం లేదు. నగర రోడ్లపైనే కాకుండా హైవేలపై కూడా విపరీతమైన వేగంతో వెళ్తున్నారు. భారీ వాహనాలు ముఖ్యంగా సరుకుల్ని, మనుషులతో ప్రయాణించే వాహనాలు నడిపే డ్రైవర్లు కూడా స్పీడ్ లిమిట్ పాటించడం లేదు. కొన్ని ప్రైవేట్ బస్సుల నిర్వాహకులైతే త్వరగా గమ్యస్థానాలకు చేర్చాలని డ్రైవర్లపై ఒత్తిడి పెంచుతుండడంతో వారు వందకు పైగా స్పీడ్తో నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. సరుకు రవాణా, స్కూల్ వ్యాన్లు, బస్లు నిర్ధేశిత వేగం కంటే ఎక్కువ వేగంతో నడుపుతున్నారు.
డివైజ్లు అమర్చుకోవాలని చెప్తున్నం
బస్సులు, ట్రక్కులు, రవాణా వాహనాలు స్పీడ్గవర్నర్స్డివైజ్లు అమర్చుకోవాలని యజమానులకు చెప్తున్నం. బస్సులు, ఇతర వాహనాల ఫిట్నెస్ కూడా తనిఖీ చేస్తున్నాం. నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకుంటాం.
రమేశ్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్
