న్యూఢిల్లీ: ఇండో చైనా బార్డర్ కు సమీపంలోని తమ భూభాగంలో కొత్త ఊర్లను సృష్టిస్తున్న చైనా.. తాజాగా డోక్లామ్ బార్డర్ కు సమీపంలో భూటాన్ భూభాగంలోనూ రెండు ఊర్లను కడుతోంది. హై రెజల్యూషన్ శాటిలైట్ ఫోటోల ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ఇంటెల్ ల్యాబ్కు చెందిన పరిశోధకుడు డామియన్ సైమన్ 2020 నవంబర్లో ఈ కొత్త గ్రామాలను గుర్తించారు. పెద్ద సంఖ్యలో ఎర్త్మూవింగ్, కన్ స్ట్రక్షన్ మెషినరీతో భారీ ఎత్తున ఇండ్లు కడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
చైనా నిర్మిస్తున్న ఈ గ్రామాలు ఇండియా బోర్డర్కు 30 కి.మీ.లోపు దూరంలోనే ఉన్నాయి. వీటి వల్ల చైనాకు ఈ ప్రాంతంలో మిలిటరీ పరంగా స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ ఉంటుందని డిఫెన్స్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు.14వ రౌండ్ చర్చలు కూడా ఫెయిల్ ఇండియా–చైనా మధ్య బుధవారం జరిగిన 14వ రౌండ్ కోర్ కమాండర్ లెవల్ చర్చలు కూడా ఫెయిలయ్యాయని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణె ప్రకటించారు. అయితే ఇరు దేశాలు పరస్పరం అంగీకారమైన పరిష్కారాల కోసం ఇకముందూ కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాయని సమాచారం.