రాష్ట్రంలో ఉద్యాన పంటల వైవిధ్యీకరణ అవసరం : హార్టి కల్చర్ వర్సిటీ వీసీ దండ రాజిరెడ్డి

రాష్ట్రంలో ఉద్యాన పంటల వైవిధ్యీకరణ అవసరం : హార్టి కల్చర్ వర్సిటీ వీసీ దండ రాజిరెడ్డి
  • హార్టికల్చర్ వర్సిటీ వీసీ దండ రాజిరెడ్డి

ములుగు, వెలుగు: రాష్ట్రంలో పంటల వైవిధ్యీకరణ చాలా అవసరమని, దీనికి రైతులే ముందుండాలని దండ రాజిరెడ్డి అన్నారు. ములుగులోని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో నిర్వహించిన జోనల్ రీసెర్చ్ అండ్ ఎక్స్‌‌‌‌‌‌‌‌ టెన్షన్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో సంభవించే సూపర్ ఎల్‌‌‌‌‌‌‌‌నినో ప్రభావాలను ఎదుర్కొనేలా ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సమగ్ర పోషక, పురుగు నియంత్రణ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. 

ప్రతి 50 కిలోమీటర్లకు ఒక వ్యవసాయ మార్కెట్ ఏర్పాటుకు ఎస్‌‌‌‌‌‌‌‌ఓపీలు అమలు చేయాలని తెలిపారు. ఐసిఏఆర్ పాలక మండలి సభ్యుడు కె. వీరభద్రరావు మాట్లాడుతూ పాడైపోయిన పాలీహౌస్‌‌‌‌‌‌‌‌ల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ వాతావరణం ఉద్యాన పంటలకు అనుకూలమని, సీతాఫలం, ద్రాక్ష సాగు విస్తరణకు అవకాశాలున్నాయని చెప్పారు.