- స్టూడెంట్లు లేకపోవడంతో
- జగిత్యాలలో తప్పిన ముప్పు
జగిత్యాల క్రైం, వెలుగు: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహంలో గ్యాస్ సిలిండర్ పేలడంతో స్టూడెంట్లు భయాందోళనతో బయటికి పరుగులు తీశారు. పేలుడు ధాటికి కిచెన్ పూర్తిగా ధ్వంసం కాగా మంటలు కూడా చెలరేగడంతో ముందుజాగ్రత్త చర్యగా నిర్వాహకులు స్టూడెంట్లను మరో బిల్డింగ్కు తరలించారు. జగిత్యాల జిల్లా కేంద్రం భవానీ నగర్లోని సంక్షేమ శాఖ బాలికల హాస్టల్లో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ హాస్టల్లో 5 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకు చదువుతున్న 400 మంది బాలికలు ఉన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కొంతమంది క్లాస్రూంలో, మిగతావారు ఆటల్లో ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్పారు. పేలుడు సమాచారం తెలిసి పలువురు తల్లిదండ్రులు అక్కడికి చేరుకున్నారు. పేలుడు తీవ్రతకు రేకుల షెడ్డు, గోడలు కూలిపోయాయి. కిచెన్పక్కనే ఉన్న పక్కింటి ప్రహరీ కూడా కూలిపోయిందని చెప్పారు. పేలుడు తర్వాత కిచెన్లో మంటలు ఎగిసిపడ్డాయని, ఫైర్సిబ్బంది సకాలంలో వచ్చి మంటలార్పారని చెప్పారు. కలెక్టర్శరత్, డీఈవో వెంకటేశ్వర్లు, జేసీ రాజేశం, ఎస్సై అల్తాఫ్లు హాస్టల్కు చేరుకుని పరిశీలించారు.