ఫీజుల దోపిడీని అరికట్టాలి.. వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్

ఫీజుల దోపిడీని అరికట్టాలి.. వామపక్ష విద్యార్థి సంఘాలు డిమాండ్

ముషీరాబాద్, వెలుగు : ప్రభుత్వ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాలు12న రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చాయి.  ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో  ఫీజుల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేసింది. 

ఆదివారం బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బంద్ కు పోస్టర్ రిలీజ్ చేశారు. విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ ప్రభుత్వం‘ మన ఊరు – మన బడి’ ద్వారా స్కూళ్లను బాగు చేశామని చెబుతున్నా  కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని  ఆరోపించారు.