మెట్రో రైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సంగారెడ్డి వరకు పొడిగించండి: మెదక్ ఎంపీ

మెట్రో రైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సంగారెడ్డి వరకు పొడిగించండి: మెదక్ ఎంపీ

రామచంద్రాపురం, వెలుగు: పటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చెరు వరకు మంజూరైన మెట్రో రైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సంగారెడ్డి వరకు పొడిగించాలని మెదక్​ ఎంపీ మాధవనేని రఘునందన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు అధికారులను కోరారు. సోమవారం మెట్రో రైల్వే మేనేజింగ్ డైరెక్టర్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ కమిషనర్​ సర్ఫరాజ్​అహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. పటాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చెరు నియోజకవర్గ పరిధిలోని పలు కీలక సమస్యలపై ఈ సందర్భంగా ఎంపీ చర్చించారు.

అనంతరం మాట్లాడుతూ సంగారెడ్డి నుంచి లింగంపల్లి, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వైపు నిత్యం వేలాది మంది ప్రయాణిస్తుంటారని మెట్రోను పొడిగిస్తే ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఓఆర్ఆర్​ ఎగ్జిట్ 2 నుంచి ఎగ్జిట్ 4 మధ్య సుల్తాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పూర్​వద్ద సర్వీస్​రోడ్డు పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉందని రోడ్డు పూర్తి కాకపోవడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతున్నారని ఎండీ దృష్టికి తీసుకెళ్లిన్నట్లు ఎంపీ తెలిపారు.