ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి మాటలు

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి మాటలు

కూనూరులో కూలిన ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై స్థానికులు స్పందించారు. ఓ ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. ‘నేను ఇంట్లో ఏదో పనిలో ఉన్నాను. ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. దాంతో బయటకు వచ్చి చూసే సరికి హెలికాప్టర్ చెట్లను తాకుతూ కూలిపోయింది. నేను చూస్తుండగానే ఇద్దరు వ్యక్తులు మంటలంటుకొని హెలికాప్టర్ నుంచి బయటకు వచ్చి కుప్పకూలారు. దగ్గరికి వెళ్దామనుకుంటే.. బాగా మంటలు, పొగ ఉండటంతో భయంతో అక్కడికి వెళ్లలేకపోయాను’ అని ఆ వ్యక్తి చెప్పాడు.