
రైతు వడ్లు కొనుగోలు చేయాలని కలెక్టర్ ను ఆదేశించిన సీఎస్
రైస్మిల్లర్తో కొనుగోలు చేయించిన సివిల్ సప్లై ఆఫీసర్లు
మంచిర్యాల, వెలుగు: సన్న వడ్లను పండించిన ఓ రైతు పంటను అమ్ముకోలేక.. తాను పడుతున్న కష్టాలను వివరిస్తూ ఫేస్బుక్లో పెట్టిన వీడియో అధికారులను కదిలించింది. కలెక్టర్కు సీఎస్ఫోన్చేసి ఆ రైతు పండించిన వడ్లను కొనుగోలు చేయాలని ఆదేశించారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన యువరైతు కొండపల్లి శరత్ ఇటీవల ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేశారు. అందులో ‘నేను ఏడెకరాల్లో జైశ్రీరాం రకం వడ్లు సాగు చేశాను. భారీ వర్షాలు, దోమపోటు, కాటుక తెగులును తట్టుకుని పండించిన పంటను ఎవరూ కొంటలేరు. కొనుగోలు కేంద్రాల్లో గ్రేడ్-ఏ కింద క్వింటాలు రూ.1,888కి కొనుగోలు చేస్తుండగా, ఓపెన్మార్కెట్లో వ్యాపారులు రూ.1800లోపే చెల్లిస్తున్నారు. ఈ ధర నాకు ఏమాత్రం గిట్టుబాటు కాదు. ఎవరైనా బియ్యం కొనేవారు ఉంటే చెప్పండి. మిల్లింగ్చేయించి మార్కెట్రేటు కంటే తక్కువకే అందిస్తాను. దయచేసి రైతులకు సపోర్టు చేయండి’ అంటూ విజ్ఞప్తి చేశారు. ఈ వీడియోను వందలాది మంది షేర్ చేయడంతో పాటు దాదాపు మూడు లక్షల మంది చూశారు. చివరకు సీఎస్సోమేష్కుమార్దృష్టికి వెళ్లడంతో వెంటనే ఫోన్లో శరత్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మంచిర్యాల జిల్లా కలెక్టర్భారతి హోళికేరితో మాట్లాడి శరత్ పండించిన వడ్లను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్సైతం శరత్తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్షణమే రైస్మిల్లర్లు వడ్లను కొనుగోలు చేసేలా చూడాలని డిస్ట్రిక్ట్ సివిల్సప్లై ఆఫీసర్ వెంకటేశ్వర్లుకు సూచించారు. ఈ మేరకు మందమర్రిలోని ఒక రైస్మిల్లర్ను సంప్రదించగా మంగళవారం నందులపల్లెకు వెళ్లి క్వింటాలు రూ.2 వేల చొప్పున కొనుగోలు చేశారని డీసీఎస్వో చెప్పారు.
గతంలో భూసమస్యపై స్పందించిన సీఎం
నందులపల్లిలోని సర్వే నంబరు 271/1ఏ సర్వే నంబరులో శరత్తండ్రి శంకరయ్య పేరిట ఉన్న 7.01 ఎకరాల భూమిని వీఆర్వో కరుణాకర్గుట్టుచప్పుడు కాకుండా కొండపల్లి శంకరమ్మ పేరిట పట్టా మార్పిడి చేశాడు. విషయం తెలిసిన శరత్ భూమిని తిరిగి తన తండ్రి పేరిట పట్టా చేసివ్వాలని రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో విసుగు చెందిన శరత్ రెవెన్యూ ఆఫీసర్ల తీరును ఏకరువు పెడుతూ ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేశాడు. ఇది సీఎం కేసీఆర్ దృష్టికి వెళ్లడంతో గత ఏడాది మార్చి 27న స్వయంగా శరత్తో మాట్లాడారు. భూసమస్యను పరిష్కరించాలని సీఎస్ ద్వారా కలెక్టర్కు ఆర్డర్స్అందాయి. ఈ మేరకు ఎంక్వైరీ జరిపించిన కలెక్టర్వీఆర్వో, ఆర్ఐలను సస్పెండ్ చేశారు. శరత్ తండ్రి శంకరయ్యకు పట్టా, 1-బీ, పహానీ
అందజేశారు.