ఫేస్ బుక్ వినూత్న నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్యంపై సోషల్ మీడియా ప్రభావం ఎంతమేర ఉంటుందో తెలుసుకోవాలని ఫేస్ బుక్ భావిస్తోంది. దీంట్లో భాగంగా ఈ ఏడాది చివరలో జరగనున్న అమెరికా ఎలక్షన్స్ లో ఒక సర్వే నిర్వహించడానికి ఫేస్ బుక్ సిద్ధమవుతోందని సమాచారం. ఈ ఎన్నికల్లో ఓట్లు వేయబోయే వారు తమ ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లను డీయాక్టివేట్ చేసుకోవాలని సోషల్ మీడియా దిగ్గజం కోరుతోంది. దీనికి గాను డబ్బులు కూడా చెల్లిస్తామనడం గమనార్హం.
So Facebook is now going to pay people to deactivate their IG and FB accounts before Election Day. It’s part of the research experiment announced Monday but WOW. This notice went out this week. pic.twitter.com/tV7DAw8F5I
— Elizabeth Dwoskin (@lizzadwoskin) September 3, 2020
ఈ మేరకు ఇన్ స్టా, ఫేస్ బుక్ అకౌంట్లను ఎన్నికల ముందు రోజు లేదా ఒక వారం ముందు డీయాక్టివేట్ చేసుకుంటే ఇన్ని డాలర్ల మేర చెల్లిస్తామని యూజర్లకు ఫేస్ బుక్ నోటిస్ పంపింది. ఈ నోటీసుల స్క్రీన్ షాట్స్ ను వాషింగ్టన్ పోస్ట్ కు చెందిన ఎలిజబెత్ డ్వోస్కిన్ అనే రిపోర్టర్ ట్విట్టర్ లో షేర్ చేసింది. అకౌంట్ డీయాక్టివేషన్ పీరియడ్ ఒక వారం నుంచి ఆరు వారాల వరకు ఉండొచ్చునని తెలుస్తోంది. ఈ టైమ్ లో యూజర్లు తమ ఎఫ్ బీ, ఇన్ స్టా అకౌంట్స్ ను వాడటానికి వీల్లేదని ఫేస్ బుక్ షరతు పెట్టింది. అందుకుగాను వారానికి 10 నుంచి 20 డాలర్ల వరకు చెల్లిస్తామని ఆఫర్ చేస్తోంది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ అధికార ప్రతినిధి లిజ్ బోర్గెస్ ధ్రువీకరించారు. తమ అకౌంట్లను నిర్ణీత పీరియడ్ లో వాడకుండా, డీయాక్టివేట్ చేసిన యూజర్లకు కంపెనీ డబ్బులు చెల్లిస్తుందని స్పష్టం చేశారు.