హైదర్నగర్లో ఫేక్ బీటెక్ సర్టిఫికెట్లు.. ఇద్దరు అరెస్టు

హైదర్నగర్లో ఫేక్ బీటెక్ సర్టిఫికెట్లు.. ఇద్దరు అరెస్టు

కూకట్​పల్లి, వెలుగు: సిటీలో మరో నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టు రట్టైంది. కొన్నేండ్లుగా హైదర్​నగర్​లో శ్రీవ్యాస కన్సల్టెన్సీ నిర్వాహకులు యూపీలోని వీర్ బహదూర్​సింగ్​పూర్వాంచల్​యూనివర్సిటీ పేరుతో సర్టిఫికెట్లు జారీ చేస్తున్నారు. హైదరాబాద్​కు చెందిన సాయివెంకట హర్షిత్​(23) 2023లో ఈ సంస్థను సంప్రదించాడు.

 ఇతడి వద్ద రూ.3 లక్షలు తీసుకుని బీటెక్​ సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇతడు మరో కన్సల్టెన్సీని సంప్రదించగా, అవి ఫేక్​అని తేలింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా , కన్సల్టెన్సీకి వెళ్లి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు.