- పెద్దపల్లి జిల్లాలో ఫేక్ కరెన్సీ గ్యాంగ్ గుట్టు రట్టు
- ఐదుగురు నిందితుల అరెస్ట్
- నకిలీనోట్లు, ప్రింటర్లు స్వాధీనం
పెద్దపల్లి, వెలుగు: దొంగనోట్లు చలామణి చేస్తున్న ఓ ముఠాను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీసులు పట్టుకున్నారు. ఐదుగురిని అరెస్టు చేయడంతో పాటు రూ. 77,400 ఫేక్ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. అలాగే నకిలీ నోట్లు తయారు చేసే రూ. 4 లక్షల విలువైన సామగ్రిని సీజ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పీఎస్లో ఏసీపీ సారంగపాణి వివరాలు తెలియజేశారు. 4 నెలల క్రితం కాల్వశ్రీరాంపూర్ మండలంలో ఒక నకిలీ నోట్ఉందన్న సమాచారం మేరకు పోలీసులు అలర్ట్ అయ్యారు. అది ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీయగా జిల్లాలోనే నకిలీ నోట్ల ప్రింటింగ్చలామణి జరుగుతోందని తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ ముఠా శుక్రవారం సుల్తానాబాద్ చెరువు కట్ట వద్ద దొంగనోట్లు మారుస్తున్నారనే సమాచారం రావడంతో సుల్తానాబాద్ సీఐ, ఎస్సైలు మాటు వేసి పట్టుకున్నారు. దొరికిన వారిలో చల్లా రాములు, దారంగుల వెంకటి, దుగ్యాల అనిల్, పెండం నగేశ్ ఉన్నారు. వీరి దగ్గరి నుంచి ఫేక్ కరెన్సీతో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన సీఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్సై ఉపేందర్ రావు, అశోక్రెడ్డి, ఏఎస్సై తిరుపతి, కానిస్టేబుల్స్ నాగయ్య, నవ్య, సదానందం, సుధాకర్, నవీన్, అమిత్, ఫయాజ్, పోచాలు, గణేశ్లను సీపీ, డీసీపీ, ఏసీపీలు అభినందించారు. క్యాష్ రివార్డులు ఇచ్చారు.