పాక్ ఆర్మీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. కాల్పుల విరమణకు.. భారత్ ట్రంప్ సాయం కోరింది!

పాక్ ఆర్మీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు.. కాల్పుల విరమణకు.. భారత్ ట్రంప్ సాయం కోరింది!
  • పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వివాదాస్పద వ్యాఖ్యలు
  • తీవ్రంగా ఖండించిన భారత్ 

న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ భారత్​పట్ల మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో కాల్పుల విరమణ కోసం భారత్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహాయం కోరిందని వ్యాఖ్యానించారు. ఈ నెల 11న బ్రస్సెల్స్​సమీపంలోని గ్రూట్ ​బిజ్​ గార్డెన్​ కాజిల్​లో ఓవర్సీస్​ పాకిస్తానీ ఫౌండేషన్​ నిర్వహించిన క్లోజ్డ్​డోర్​ సన్మాన సభలో మునీర్​ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘ఆపరేషన్ సిందూర్ సమయంలో భారతదేశానికి మన సైన్యం తగిన జవాబిచ్చింది. అధునాతన భారత విమానాలను కూల్చివేసి.. అంతర్జాతీయ గౌరవాన్ని సాధించింది. దీంతో కాల్పుల విరమణ కోసం కల్పించుకోవాలంటూ ట్రంప్ దగ్గర భారత్​ ప్రాధేయపడింది” అని మునీర్​ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్​మీడియాలో వైరల్​గా మారాయి. అయితే, ఆ వ్యాఖ్యలను భారత్ తోసిపుచ్చింది. మునీర్​వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధాలని కొట్టిపారేసింది. భారత మీడియాలో మునీర్‌‌ను 'బ్లఫ్‌‌మాస్టర్' అంటూ విమర్శలు వెల్లువెత్తాయి.