ఎంతకు తెగించార్రా: గల్ఫ్కు పంపిస్తామంటూ ఏకంగా ఎమ్మెల్యేకే ఫోన్ కాల్

ఎంతకు తెగించార్రా: గల్ఫ్కు పంపిస్తామంటూ ఏకంగా ఎమ్మెల్యేకే ఫోన్ కాల్

గల్ఫ్ దేశాలకు పంపిస్తామంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ట్రావెల్స్ దందా గుట్టు రట్టయ్యింది.. గల్ఫ్ కు పంపిస్తామంటూ ఏకంగా ఎమ్మెల్యే అది శ్రీనివాస్ కే ఫోన్ చేయడంతో ఈ దందా బయటపడింది. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మడలంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలిలా ఉన్నాయి.. స్థానిక రంగపేట గ్రామానికి చెందిన నవీన్ అనే వ్యక్తి ఓ యువతిని నియమించుకొని ఈ అక్రమ దందా చేపట్టినట్టు తెలిపారు పోలీసులు.

జగిత్యాల జిల్లా కేంద్రంలోని జంబిగద్దె ప్రాంతంలో అనుమతి లేకుండా లక్ష్మి గల్ఫ్ ట్రావెల్స్ పేరుతో అక్రమ దందా నిర్వహిస్తున్నాడు నవీన్.యువతి ద్వారా అమాయక ప్రజలకు ఫోన్లు చేసి విదేశాలకు పంపిస్థానని..  డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు నవీన్. ఈ క్రమంలో సదరు యువతీ ఓ ఎమ్మెల్యే అదిశ్రీనివాస్ కు ఫోన్ చేసి గల్ఫ్ పంపిస్తానని నమ్మబలికింది..  ఎమ్మెల్యే తనకెందుకు ఫోన్ చేశావని అడగగా ఆ యువతి ఎమ్మెల్యే పైనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

Also Read:-ఆ స్థలాలు 125 గజాల్లోపు ఉంటేనే ఫ్రీగా రిజిస్ట్రేషన్..

ఈ ఉదంతంపై ఎమ్మెల్యే ఎస్పీకి సమాచారం అందించగా... ఆదివారం ( మే 4 ) ట్రావెల్స్ పై దాడి చేశారు. నవీన్ నిర్వహిస్తున్న ట్రావెల్స్ కు ఎలాంటి అనుమతి లేదని గుర్తించిన పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.