నాపై తప్పుడు ప్రచారం.. హైకోర్టులో మాజీ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ పిటిషన్

నాపై తప్పుడు ప్రచారం.. హైకోర్టులో మాజీ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ పిటిషన్

హైదరాబాద్, వెలుగు: సోషల్ మీడియాలో తనపై వస్తున్న అవినీతి ఆరోపణలు, తన బిడ్డ పెండ్లి ఖర్చుపై వస్తున్న తప్పుడు ప్రచారాన్ని తొలగించేలా ఆదేశించాలని హైకోర్టును రిటైర్డ్ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ కోరారు. ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్​లో ప్రతివాదులుగా కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ, గూగుల్, యూట్యూబ్ ను చేర్చారు. ఈ పిటిషన్ ను మంగళవారం జస్టిస్ సూరేపల్లి నందా విచారించారు. తాను అవినీతికి పాల్పడినట్లు, ఇష్టమొచ్చినట్లు వార్తలు ప్రచారం చేస్తున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం విచారణ జరిపి ఫాల్స్ అని తేల్చిందని చెప్పారు. ఆ రిపోర్ట్ ను హైకోర్టుకు రజత్ కుమార్ అందజేశారు.