
ఫ్యాన్స్ చాలామందే ఉంటారు. కానీ, డై హార్డ్ ఫ్యాన్స్ కొంతమందే ఉంటారు. ఇక ఆ అభిమానులు స్టార్లకోసం చేసే పనులు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. నిన్న రాత్రి జరిగిన భారత్, శ్రీలంక వన్డే మ్యాచ్లో అదే జరిగింది. విరాట్ కోహ్లీని కలవడానికి తన అభిమాని ఒకరు సెక్యూరిటీని దాటి గ్రౌండ్లోకి దూసుకొచ్చాడు. నేరుగా విరాట్ దగ్గరికి వెళ్లి కాళ్లపై పడ్డాడు. దూసుకొస్తున్న అభిమానిని చూసి భయపడ్డ విరాట్.. మొదట కొంచెం దూరం జరిగాడు. తర్వాత కాళ్లపై పడ్డ అభిమానిని లేపి దగ్గరకు తీసుకున్నాడు. సూర్య కుమార్ యాదవ్కి ఫోన్ ఇచ్చి ఫొటో తీయించుకున్నాడు. తర్వాత గ్రౌండ్ స్టాఫ్ ఆ అభిమానిని తీసుకెళ్లారు.
నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ లంక బౌలర్లపై ఏ విధంగా విరుచుకుపడ్డాడో అందరికీ తెలిసిందే. స్పిన్, ఫేస్ అనే తేడాలేకుండా శ్రీలంక బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 110 బంతుల్లో 13 ఫోర్లు 8 సిక్సర్లతో 166 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. దీంతో టీమిండియా 390 పరుగులు చేసింది.