కొత్త చట్టాలతో రైతులు ఆందోళనలో ఉన్నారు

కొత్త చట్టాలతో రైతులు ఆందోళనలో ఉన్నారు

కరీంనగర్: చట్టాలు ఎన్ని వచ్చినా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం రైతులకు మద్దతుగానే ఉంటారన్నారు మంత్రి గంగుల కమలాకర్. గురువారం ఆయన కరీంనగర్ లో కెడీసీసీ బ్యాంకు పరిపాలన భవనాన్ని మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. రూ .63.50 కోట్ల రుణాల చెక్కును సహకార సంఘాలకు అందజేశారు మంత్రులు.

ఈ సందర్భంగా మాట్లాడిన గంగుల పౌరసరఫరాల శాఖ ధాన్యం కొనుగోలు చేసినందుకే మద్దతు ధర లభించిందన్నారు. రాబోయే యాసంగిలో ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉన్నందున సహకార సంఘాలు రైతులకు అండగా ఉండాలన్నారు. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలతో కొనుగోలు కేంద్రాలు ఉంటాయా లేదా అన్న ఆందోళన రైతుల్లో నెలకొందన్నారు మంత్రి గంగుల కమలాకర్. రూ .63.50 కోట్ల రుణాల చెక్కును సహకార సంఘాలకు అందజేశారు మంత్రులు.