సదర్మాట్‌ వరి ఆయకట్టుకు నీళ్లివ్వాలని.. ధర్మాజీపేట మెయిన్​ రోడ్డుపై రైతుల ధర్నా

సదర్మాట్‌ వరి ఆయకట్టుకు నీళ్లివ్వాలని.. ధర్మాజీపేట మెయిన్​ రోడ్డుపై  రైతుల ధర్నా

కడెం, వెలుగు :  నిర్మల్​ జిల్లా ఖానాపూర్ మండలంలోని మేడంపల్లి సదర్మాట్ ఆనకట్ట నుంచి ఆయకట్టు చివరి పంటల వరకు సాగునీళ్లివ్వాలని కొత్త మద్దిపడగ,పాత మద్దిపడగ, లక్ష్మీ సాగర్ గ్రామాల రైతులు ధర్మాజీపేట వద్దనున్న మెయిన్​రోడ్డుపై ఆందోళన చేశారు. వారు మాట్లాడుతూ ఇరిగేషన్ ఆఫీసర్ల సూచనల మేరకే తాము సదర్మాట్ ఆయకట్టులో పంటలు సాగు చేస్తున్నామన్నారు. ఇప్పుడు ధర్మాజీపేట్ వరకు మాత్రమే సాగునీటిని విడుదల చేసి తమ గ్రామాలకు విడుదల చేయడం లేదన్నారు. 

ఓ పక్క పంటలు ఎండుతుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదన్నారు. వెంటనే సాగునీటిని విడుదల చేస్తామని హామీ ఇస్తేనే ధర్నా విరమిస్తామని రైతులు స్పష్టం చేశారు. దీంతో అక్కడికి వచ్చిన కడెం ఎస్సై కొసన రాజు ఆందోళనకారులతో మాట్లాడారు. సంబంధిత ఇరిగేషన్ ఆఫీసర్​డబ్బులు తీసుకొని వేరే గ్రామాల రైతులకు సాగునీటిని విడుదల చేస్తున్నారని, అతడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.