అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
  • మహబూబ్ నగర్ జిల్లాలో ఘటన

హన్వాడ, వెలుగు: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌‌నగర్‌‌‌‌ జిల్లా హన్వాడ మండలం షేక్ పల్లి గ్రామానికి చెందిన గంగరాజు చిన్న మొగులయ్య (60) తనకున్న మూడెకరాల్లో వరి వేశాడు. పంట పెట్టుబడి, ఇంటి అవసరాల కోసం మొత్తం రూ.7 లక్షల అప్పులు చేశాడు. కిందటి యాసంగిలో పంట నష్టం రావడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. 

ఈ క్రమంలో ఈ నెల 9న పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు మొగులయ్యను మహబూబ్‌‌నగర్‌‌‌‌ జనరల్‌‌ హాస్పిటల్‌‌కు తలించారు. చికిత్స పొందుతూ గురువారం పరిస్థితి విషమించడంతో మృతి చెందాడు. మృతుడికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.