సిధి: మధ్యప్రదేశ్లో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మద్యం మత్తులో వేగంతో వెళుతున్న ట్రక్కు డ్రైవర్ అకస్మాత్తుగా దూసుకువచ్చిన స్కూటరిస్ట్ను తప్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ట్రక్కు బోల్తా పడింది.
రోడ్డుపై దూసుకుపోయి జీపును, టూవీలర్ను ఢీకొట్టింది. మధ్యప్రదేశ్లోని సిధి జిల్లా డోల్గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగిందని సిధి ఎస్పీ రవీంద్ర వర్మ తెలిపారు. జీపులో ఉన్న ఆరుగురితోపాటు టూవీలర్ రైడర్ కూడా ప్రాణాలు కోల్పోయారు.