మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

సిధి: మధ్యప్రదేశ్​లో గురువారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. మద్యం మత్తులో వేగంతో వెళుతున్న ట్రక్కు డ్రైవర్ అకస్మాత్తుగా దూసుకువచ్చిన స్కూటరిస్ట్​ను తప్పించేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ట్రక్కు బోల్తా పడింది.

రోడ్డుపై దూసుకుపోయి జీపును, టూవీలర్​ను  ఢీకొట్టింది. మధ్యప్రదేశ్​లోని సిధి జిల్లా డోల్​గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగిందని సిధి ఎస్పీ రవీంద్ర వర్మ తెలిపారు. జీపులో ఉన్న  ఆరుగురితోపాటు టూవీలర్​ రైడర్​ కూడా ప్రాణాలు కోల్పోయారు.