ఆయుధాలు అమ్ముతున్న తండ్రీకొడుకు అరెస్టు

ఆయుధాలు అమ్ముతున్న తండ్రీకొడుకు అరెస్టు

కంటోన్మెంట్, వెలుగు:   క్రమంగా ఆయుధాలు అమ్ముతున్న తండ్రీకొడుకును బోయిన్ పల్లి, సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు.  వారి నుంచి నాలుగు డాగర్లు, నాలుగు రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు.  పోలీసులు తెలిపిన ప్రకారం... రాజస్తాన్​నుంచి తండ్రీ  కొడుకులు వినయ్​శర్మ కొలారియా (53), ఆకాశ్​ కొలారియా (23)  సిటీకి వచ్చి న్యూ బోయిన్​పల్లి సౌజన్య కాలనీలో నివసిస్తున్నారు. జేసీ క్రాఫ్ట్​పేరుతో హ్యాండీ క్రాఫ్ట్​షాపు నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా బిజినెస్​ నడవడం లేదు. దీంతో పెళ్లిళ్ల ఊరేగింపులో కత్తులు, డాగర్లు, సినిమాల్లో వాడే అనుకరణ రైఫిళ్లకు డిమాండ్ ఉందని గ్రహించారు. రాజస్థాన్ లోని ఓ వ్యాపారి నుంచి కత్తులు, డాగర్లు,  రైఫిళ్లను హ్యాండీ క్రాఫ్ట్స్​పేరుతో హైదరాబాద్​కు ట్రాన్స్​పోర్టు ద్వారా  తెచ్చి షాపులో భద్రపరిచాడు.  వాటిని  రూ.6 వేల నుంచి రూ.15 వేల వరకు అమ్ముతున్నారు. సమాచారం అందడంతో పోలీసులు జేసీ  క్రాఫ్ట్స్​ షాపుపై దాడి చేశారు. నిందితులిద్దరిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.