
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఆర్టీసీ కార్గో విభాగంలో డెలివరీ కాకుండా మిగిలిపోయిన వస్తువులను(అన్క్లెయిమ్ఐటమ్స్) మరోసారి వేలం వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకు పలుసార్లు వేలం నిర్వహించగా, చాలామంది వస్తువులను తక్కువ ధరలకే దక్కించుకున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఈ నెల 16, 17 తేదీల్లో మిగిలిపోయిన వస్తువులను వేలం వేయనున్నట్టు గ్రేటర్ఆర్టీసీ అసిస్టెంట్ట్రాఫిక్మేనేజర్(లాజిస్టిక్స్) ఇషాక్బిన్మహ్మద్ తెలిపారు.
ఈసారి వేలంలో 300 రకాల వస్తువులు ఉన్నాయన్నారు. జేబీఎస్లోని కార్గో కేంద్రంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5గంటల వరకు వేలం ఉంటుందని, ఎవరైనా నేరుగా వచ్చి పాల్గొనవచ్చన్నారు. ఈసారి 25 ఆటోమొబైల్స్ఐటమ్స్, 10 ఎలక్ట్రికల్ఐటమ్స్, 10 క్లాత్ఐటమ్స్, 25 ఎలక్ట్రానిక్స్ఐటమ్స్, 10 హౌస్హోల్డ్ మెటీరియల్, 15 హార్డ్వేర్ ఐటమ్స్,10 ఇండస్ట్రియల్ స్పేర్స్, 195 జనరల్ ఐటమ్స్ ఉన్నాయని చెప్పారు.