జగిత్యాల జిల్లాలో విషాదం నెలకొంది. ఒక్క రోజు వ్యవధిలో తండ్రీ, కొడుకులు చనిపోయారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో ఘటన జరిగింది.
సుధా వేణి కొమురయ్య రెండు రోజుల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. హైదరాబాద్ లో ఉంటున్న పెద్ద కొడుకు మల్లేశం తండ్రి అత్యక్రియలు పూర్తి చేసి, తిరిగి సిటీకి వస్తుండగా... గుండెపోటు వచ్చింది. దీంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఒక్క రోజు వ్యవధిలోనే తండ్రీ కొడుకులు ప్రాణాలు కోల్పోవడంతో...గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.