- మరో కొడుకుకు గాయాలు
- మృతులు మధ్యప్రదేశ్వాసులు
- మైలార్ దేవ్పల్లిలో ఘటన
శంషాబాద్, వెలుగు: స్వెటర్లు, బ్లాంకెట్ల షాపులోకి కారు దూసుకెళ్లిన ఘటనలో తండ్రీకొడుకు మృతిచెందగా.. మరో కొడుకు గాయపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్కు చెందిన ప్రభు మహరాజ్(60), ఆయన కొడుకులు దీపక్ (20), సత్యనాథ్ కొన్నేళ్లుగా మైలార్ దేవ్పల్లిలోని దుర్గా నగర్ చౌరస్తా వద్ద రోడ్డు పక్కన షెడ్డు ఏర్పాటు చేసుకొని బ్లాంకెట్లు, స్వెటర్లు అమ్ముతున్నారు. బుధవారం ఉదయం గగన్ పహాడ్ నుంచి చాంద్రాయణగుట్ట వైపు వెళ్తున్న కారు ఓవర్స్పీడ్తోఅదుపుతప్పి వీరి షాపులోకి దూసుకెళ్లింది.
ఈ ప్రమాదంలో ప్రభు మహరాజ్, ఆయన చిన్న కొడుకు దీపక్ అక్కడికక్కడే మృతిచెందగా, పెద్ద కొడుకు సత్యనాథ్స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే కారును అక్కడే వదిలేసి అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. డ్రైవర్హుస్సేన్తోపాటు మరో ముగ్గురిని స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు తెలిసింది. వీరంతా కాలేజీ స్టూడెంట్స్అని సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సత్యనారాయణ పేర్కొన్నారు.
