రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతి చెందారు. తల్లికి తీవ్ర గాయలయ్యాయి. ఈ సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట దగ్గర ఇవాళ (బుధవారం) సాయంత్రం జరిగింది. కొర్విపల్లి గ్రామానికి చెందిన మాద పోచయ్య, తల్లి రాజవ్వ, తండ్రి బీరయ్యతో కలిసి బైక్ మీద చిన్నశంకరంపేట మార్కెట్ కు బయల్దేరారు. అంబాజీపేట శివారు దగ్గర మెదక్-చేగుంట దారిలో మెదక్ వైపు వెళ్తున్న కారు వారి బైక్ ను ఢీ కొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన మాద పోచయ్య (28) అక్కడికక్కడే చనిపోగా.. అతని తల్లిదండ్రులు తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా .. మార్గమధ్యంలో బీరయ్య (65) మృతి చెందాడు. రాజవ్వకు డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. ప్రమాదంలో తండ్రి కొడుకులిద్దరూ మృతి చెందడంతో కొర్విపల్లి గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రమాదంలో మృతి చెందిన పోచయ్యకు భార్య, ముగ్గురు కొడుకులు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతి
- తెలంగాణం
- December 2, 2021
లేటెస్ట్
- KKR vs PBKS: ఐపీఎల్ చరిత్రలోనే అద్భుతం.. 262 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేసిన పంజాబ్
- మీ ఫోన్ను ఎవరైనా ఉపయోగిస్తున్నట్లు అనిపించిందా..? ఈ కోడ్ డయల్ చేసి హిస్టరీ తెలుసుకోండి
- అబిడ్స్లో రూ.49 లక్షల విలువైన నోట్లకట్టలు సీజ్
- న్యూయార్క్ ఆకాశంలో ఓ వింత వస్తువు..ఏలియన్స్ వెహికలేనా?
- కాళేశ్వరం, మిషన్ భగీరథలో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకుండు : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
- KKR vs PBKS: 22 ఫోర్లు, 17 సిక్సులు.. పంజాబ్ బౌలర్లను చితక్కొట్టిన కోల్కతా
- స్టాక్ మార్కెట్లో మోసపోతే .. డబ్బును రికవరీ చేసి ఇచ్చిన్రు
- Whirlpool lay offs: వర్ల్పూల్ నుంచి వెయ్యి మంది ఉద్యోగులు ఔట్..
- Nelson Dilip Kumar: మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా..జైలర్ డైరెక్టర్ డ్రీం ప్రాజెక్ట్ ఇదే!
- దేశంలోనే అతిపెద్ద సైబర్ క్రైం : రూ.25 కోట్లు పోగొట్టుకున్న మాజీ డైరెక్టర్
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- విమానంలో డీజీపీకి అసౌకర్యం