పట్టపగలే గోల్డ్ షాపులో తండ్రీ కూతుళ్లు నగలచోరీ 

పట్టపగలే గోల్డ్ షాపులో తండ్రీ కూతుళ్లు నగలచోరీ 

ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ లో సిహానీ గేట్ ప్రాంతంలో పట్టపగలే బంగారం షాపులో చోరీ జరిగింది. కస్టమర్ల మాదిరిగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు దుకాణంలోకి వచ్చిన తండ్రీ కూతుళ్లు తమ చేతివాటం ప్రదర్శించబోయి అడ్డంగా బుక్కయ్యారు. దర్జాగా షాపులోకి వచ్చిన వీరిద్దరూ డిస్ ప్లే లో ఉంచిన బంగారు నెక్లెస్ గురించి ఆరా తీశారు. దాని గురించి సిబ్బంది వారికి వివరించారు.  మాయమాటలతో బురిడీ కొట్టించేందుకు ప్రయత్నించారు.  కానీ వారి పప్పులు ఉడకలేదు. ఇక లాభం లేదనుకున్న యువతి తనవెంట తెచ్చుకున్న కారం పొడిని రెండు చేతులతో తీసుకుని సిబ్బంది ముఖంపై చల్లింది. వారు తేరుకునే లోపే తండ్రి డిస్ ప్లే లో ఉన్న నెక్లెస్ ను తీసుకుని పారిపోయాడు. కానీ కూతురు మాత్రం పట్టుబడింది. కిలాడీ లేడీ పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటే సిబ్బందిలోని  ఓ వ్యక్తి చేతితో ఆమె టీ షర్టును గట్టిగా పట్టుకుని ఆపేశాడు. అప్పటికే ఆమె తండ్రి గోల్డ్ నెక్లెస్ తీసుకుని జంప్ అయ్యాడు. ఈ దృశ్యాలు షాపులోని సీసీటీవీ పుటేజీలో రికార్డు అయ్యాయి.