
సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది . కుటుంబ కలహాలతో ఇద్దరు పిల్లలకు ఉరి వేసి తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు తండ్రి. సుభాష్(40) అనే వ్యక్తి తన ఇద్దరు పిల్లలు కుమారుడు రిథిక్ మర్యాన్(09), కుమార్తె ఆరాధ్య(05)కి ఉరివేసి అనంతరం తాను ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్ కి సమాచారం ఇచ్చారు స్థానికులు. డోర్ పగలగొట్టి చూడగా మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సుభాష్ భార్య మంజుల(35) కి వేరొకరితో వివాహేతర సంబంధం ఉన్నట్టు సమాచారం. దీని వల్ల గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవలు తలెత్తడంతో కొన్ని రోజుల క్రితం భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో సుభాష్ తన ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలోనే మనస్థాపానికి గురైన సుభాష్ పిల్లలకు ఉరివేసి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.