రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలి

రీయింబర్స్ మెంట్  బకాయిలు విడుదల చేయాలి

బషీర్​బాగ్​,వెలుగు: పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్​మెంట్​ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లక్డికాపూల్​లోని హైదరాబాద్ కలెక్టరేట్​ను బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ముట్టడించింది. రోడ్డుపై బైఠాయించడంతో కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించిన నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​ స్టూడెంట్​ విభాగం రాష్ట్ర​ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్​ మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్​మెంట్ చెల్లించకుండా సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ ముకుంద్ కు వినతిపత్రం అందజేశారు