వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా జులై 17న నీట్ పరీక్ష జరిగింది. అయితే కొన్ని పరీక్షా కేంద్రాల్లో చెకింగ్ ల పేరుతో అవమాన కర ఘటనలు చోటుచేసుకున్నాయి. నీట్ పరీక్షల్లో డ్రెస్ కోడ్ నిబంధనల్లో భాగంగా విద్యా్ర్థినుల లో దుస్తులు విప్పించినట్టు ఫిర్యాదులు వచ్చాయి. ఇక వివరాల్లోకి వెళితే కేరళలోని కొల్లాం మార్థోమా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరీక్షా కేంద్రంలో డ్రెస్ కోడ్ పేరుతో విద్యార్థులకు తీవ్ర అవమానం చేసినట్టు సమాచారం. మామూలుగా మెటల్ వస్తువులు నీట్ పరీక్షకు అనుమతించరు. అయితే ఓ పరీక్షా కేంద్రంలో దాదాపు 100మంది విద్యార్థినులను లోదుస్తులు తీసేసి పరీక్ష హాల్లోకి వెళ్లాలని అక్కడి సిబ్బంది ఆదేశించారు. ఇక చేసేదేం లేక తప్పనిసరి పరిస్థితుల్లో అమ్మాయిలు ఆ నిబంధనను పాటించాల్సి వచ్చింది. ఎగ్జామ్ అనంతరం విద్యార్థినుల ద్వారా విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో తామంతా మానసిక వేదనకు గురయ్యామని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ ఆరోపణలను మార్థోమా కాలేజీ ఖండించింది. తమ కళాశాలలో కేవలం పరీక్ష నిర్వహించేందుకు మాత్రమే అనుమతులిచ్చామని, తనిఖీలు, బయోమెట్రిక్ వంటివి వేరే వ్యక్తులు చూసుకున్నారని తెలిపింది.
నీట్ పరీక్షలో విద్యార్థినులకు తీవ్ర అవమానం
- దేశం
- July 19, 2022
లేటెస్ట్
- ఒకే కుటుంబంలోని ఐదుగురిని గొడ్డలితో నరికి చంపి.. వ్యక్తి ఆత్మహత్య!
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- గుడ్న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు