- సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో ప్రమాదం
రామచంద్రాపురం, వెలుగు: ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేయబోయి ప్రమాదవశాత్తు టైర్ల కింద పడి మహిళా జిమ్ ట్రైనర్చనిపోయిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. రామచంద్రాపురం ఎస్ఐ రామకృష్ణ తెలిపిన ప్రకారం.. బాంబే కాలనీకి చెందిన గంటా సావిత్రి కుమార్తె ఉమామహేశ్వరి(28) స్థానిక జిమ్లో ట్రైనర్ గా చేస్తుంది. ఆదివారం ఉదయం డ్యూటీకి స్కూటీపై వెళ్తూ.. కాలనీలోని రోడ్డులో ముందు వెళ్లే ఏలూరు డిపో ఆర్టీసీ బస్సును ఓవర్టేక్ చేయబోయి ప్రమాదవశాత్తు వెనక టైర్ల కింద పడింది.
తలకు, భుజాలకు తీవ్ర గాయాలై ఉమామహేశ్వరి స్పాట్ లో చనిపోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి డెడ్ బాడీని పటాన్చెరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదుతో ఆర్సీపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
