- బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్ డిమాండ్
హైదరాబాద్, వెలుగు: తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు భాను ప్రకాశ్ డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అయినా ఇప్పటి వరకు ఆ హామీని అమలు చేయలేదన్నారు. వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని.. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. మూడేళ్లుగా ఉద్యోగాలు కోల్పోయి.. కుటుంబ పోషణ భారమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భాను ప్రకాశ్ ఆవేదన వ్యక్తం చేశారు.