
ఖతార్లో ఫిఫా ప్రపంచ కప్ 2022 అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్టేడియం నిర్మాణ బృందంలో భాగమైన మహారాష్ట్రలోని నాగ్పూర్కు చెందిన ఇంజినీర్ షాహిద్ అలీ తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. స్టేడియం నిర్మించడం సవాలుతో కూడుకున్న పని అని అన్నారు. ఖతార్ స్టేడియంలో ఫిఫా వరల్డ్ కప్ 2022 ప్రారంభ వేడుకలను చూడటం చాలా సంతోషంగా ఉందన్న ఆయన.. స్టేడియం నిర్మాణ బృందంలో భాగమైనందుకు గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. గరిష్ట ఉష్ణోగ్రతల నడుమ ఖతార్లో పని చేయడం ఒక ఛాలెంజింగ్ టాస్క్ అని చెప్పారు.
స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభమైనపుడు 2017లో తాను ఖతార్ వెళ్లానని షాహిద్ తెలిపారు. చైనా, యూకే, ఆస్ట్రేలియాతో సహా 35 దేశాలకు చెందిన వారు తమతో కలిసి పని చేశారన్నారు. అందులో గ్రౌండ్ లెవల్ (కార్మికులు) నుండి టాప్ మేనేజ్మెంట్ (డైరెక్టర్లు) వరకు భారతీయులన్నారని స్పష్టం చేశారు. ఫిఫా ప్రపంచ కప్ 2022 నవంబర్ 20న ఖతార్లో ప్రారంభమైంది. ఈ పోటీలు డిసెంబర్ 18 వరకు జరుగనున్నాయి. ఈ టోర్నమెంట్లోని 64 మ్యాచ్లకు ఖతార్ అంతటా ఎనిమిది స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.