ఫిఫా వరల్డ్ కప్ ...సెమీస్ బెర్తు కోసం 8 జట్లు పోటీ

ఫిఫా వరల్డ్ కప్ ...సెమీస్ బెర్తు కోసం 8 జట్లు పోటీ

ఎన్నో సంచలనాలు, మరెన్నో ట్విస్టుల మధ్య  ఫిఫా వరల్డ్ కప్ తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఫిఫా వరల్డ్ కప్లో 8 జట్లు అద్భుత ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. మొత్తం 32 జట్లు పోటీపడగా...16 జట్లు నాకౌట్ కు అర్హత సాధించాయి. ఇందులో  నెదర్లాండ్స్, అర్జెంటీనా, క్రొయేషియా, బ్రెజిల్, ఇంగ్లండ్, ఫ్రాన్స్, మొరాకో, పోర్చుగల్ జట్లు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకొచ్చాయి. డిసెంబర్ 9 నుంచి ఈ ఎనిమిది జట్లు సెమీస్ లో బెర్తు కోసం ఢీకొట్టుకోబోతున్నాయి. 


క్వార్టర్ ఫైనల్లో ఎవరితో ఎవరు..?

క్వార్టర్ ఫైనల్స్‌లో భాగంగా తొలి మ్యాచ్ బ్రెజిల్, క్రొయేషియా మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ ఎడ్యుకేషన్ సిటీ స్టేడియంలో రాత్రి 8:30 గంటలకు మొదలవుతుంది. ఆ తర్వాత మ్యాచ్లు డిసెంబర్ 10న జరగనున్నాయి. ఇందులో పోర్చుగల్తో మొరాకో, అర్జెంటీనాతో నెదర్లాండ్స్ తలపడతాయి. నెదర్లాండ్స్, అర్జెంటీనా మధ్య అర్థరాత్రి 12:30కు ఈ మ్యాచ్ జరగనుంది. ఆ తర్వాత రాత్రి 8:30 గంటలకు మొరాకో, పోర్చుగల్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇక క్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో మ్యాచ్ డిసెంబరు 11న ఇంగ్లండ్, ఫ్రాన్స్ మధ్య నిర్వహిస్తారు. అర్థరాత్రి 12:30 గంటలకు అల్ బైట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతుంది.