Virat Kohli, Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలపై క్లారిటీ

Virat Kohli, Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలపై క్లారిటీ

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఈ ఇద్దరు గతకొన్నేండ్లుగా టీమిండియాకు వెన్నెముకలా ఉన్నారు. లెక్కలేనన్ని రికార్డులు సృష్టించారు. అయితే, 2019 వన్డే వరల్డ్ కప్ టైంలో వీళ్ళిద్దరు గొడవ పడ్డారని, దానివల్ల కొంతకాలం సరిగా మాట్లాడుకోలేదనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వార్తలు నిజమనేలా విరాట్ భార్య అనుష్క శర్మ, రోహిత్ భార్య రితిక సజ్దే సోషల్ మీడియా అకౌంట్స్ లో ఒకరినొకరు అన్ ఫాలో చేసుకున్నారు. 2020 ఐపీఎల్ లో కూడా కోహ్లీ, రోహిత్ ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు. ఈ వార్తలన్నీ నిజమేనని, వాళ్లిద్దరు నిజంగానే గొడవ పడి కొద్దిరోజులు మాట్లాడుకోలేదని టీమిండియా మాజీ ఫీల్డి్ంగ్ కోచ్ శ్రీధర్ స్పష్టం చేశాడు. ఈ విషయాలన్నీ తను రాసిన ‘కోచింగ్ బియాండ్- మై డేస్ విత్ ఇండియన్ క్రికెట్ టీం’ బుక్ లో వెల్లడించాడు.

‘2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు డ్రస్సింగ్ రూంలో చాలా డిస్కషన్స్ జరిగాయి. రోహిత్, కోహ్లీ.. సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్ ఫాలో అయ్యారు. రెండు సెపరేట్ గ్రూపులు తయారయ్యాయి. తర్వాత వెస్టిండీస్ తో టీ20 సిరీస్ కోసం యూఎస్ వెళ్లాం. అక్కడికి వెళ్లగానే కోహ్లీ, రోహిత్ ను కోచ్ రవిశాస్త్రి తన గదికి పిలిపించుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవలకు పుల్ స్టాప్ పెట్టాలని కోహ్లీ,- రోహిత్ లకు సూచించాడు. మీ ఇద్దరూ టీంలో సీనియర్స్. ధోనీ రిటైర్ అయిన తర్వాత మీరిద్దరూ జట్టులోకి మిగతా క్రికెటర్లకు రోల్ మోడల్ గా ఉండాలి. ఈ గొడవల వల్ల డ్రెస్సింగ్ రూమ్ అట్మోస్పియర్ పాడవుతుంది. మీ మధ్య ఏమున్నా సరే అవన్నీ పక్కనబెట్టి కలిసి ముందుకు వెళ్లాలని రవిశాస్త్రి  చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరిలో మార్పు కనిపించింది. నవ్వుతూ విష్ చేసుకోవడం, మాట్లాడుకోవడం మొదలుపెట్టార’ని బుక్ లో వివరించాడు.