
హైదరాబాద్ సిటీ, వెలుగు: క్యాన్సర్ కంటే నెగిటివిటీతో నిండిన ప్రపంచంలో జీవించడం చాలా కష్టమని సినీ నటి ఐశ్వర్య రాజేశ్, కమెడియన్ అలీ అన్నారు. గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 12న గచ్చిబౌలి స్టేడియంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన రన్ నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన టీషర్ట్, మెడల్ను శుక్రవారం హోటల్ దసపల్లాలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ చినబాబు సుంకవల్లి మాట్లాడుతూ.. 2కే, 5కే, 10కే విభాగాల్లో రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 130 దేశాల్లో తమ ఫౌండేషన్ ద్వారా క్యాన్సర్పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో నరేంద్రనాథ్, ప్రశాంతి, రమేశ్, ఖాజా పాల్గొన్నారు.