
గండిపేట, వెలుగు: అగ్ని ప్రమాదంలో ఓ సినీ కొరియోగ్రాఫర్ మృతిచెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. కొరియోగ్రాఫర్పోరేటి వీరేందర్రెడ్డి(38) పుప్పాలగూడ శ్రీనగర్ కాలనీ కుతుబ్ ఆర్కెడ్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. మంగళవారం రాత్రి ఆయన తల్లిదండ్రులు ప్రకాశ్రెడ్డి, విజయ, పిల్లలు మౌతిక, నిషాంత్రెడ్డి ఒక గదిలో పడుకున్నారు.
మరో గదిలో వీరందర్రెడ్డి నిద్రించారు. అర్ధరాత్రి ఆయన గదిలో షార్ట్సర్క్యూట్ జరిగి, మంటలు చెలరేగాయి. కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్సిబ్బంది వచ్చి, మంటలు ఆర్పివేశారు. వీరేందర్రెడ్డిని ఆస్పత్రికి తరలించగా మంటలు అంటుకోవడం వల్ల మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.