కరీంనగర్ క్రైం, వెలుగు: క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్ లావాదేవీల్లో అమాయకుడైన తమ కొడుకును ఇరికించి జైలుకు పంపడమే కాకుండా.. రూ.11 లక్షలు చెల్లించాలని సైబర్క్రైం పోలీసులు వేధిస్తున్నారని కరీంనగర్ లోని జ్యోతినగర్కు చెందిన వంగల రమణ–స్వప్న దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. తమ కుమారుడు సాయి మణిదీప్కు దాసరి రమేశ్ట్రైనింగ్ ఇచ్చి రూ.కోట్లలో మోసాలకు పాల్పడ్డాడని ఆరోపించారు.
సాయి మణిదీప్ వద్ద కూడా రూ.25 లక్షలు తీసుకున్నాడని తెలిపారు. ఈ కేసులో దాసరి రమేశ్తోపాటు తమ కొడుకుని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారని చెప్పారు. సైబర్ క్రైం పోలీసులు, రమేశ్ కుమ్మక్కై కేసు నుంచి బయట పడాలంటే రెండు రోజుల్లో రూ.11 లక్షలు ఇవ్వాలని బెదిరిస్తున్నారని వాపోయారు.
