బోనీ కపూర్ క్రెడిట్ కార్డు నుంచి రూ. 3.82 లక్షలు చోరీ

బోనీ కపూర్ క్రెడిట్ కార్డు నుంచి రూ. 3.82 లక్షలు చోరీ

సైబర్ నేరగాళ్లు ఎవరినీ వదలడం లేదు. సామాన్యుడి నుంచి సెలబ్రెటీలు మోసపోతున్నారు. ప్రముఖ నిర్మాత బోనీ కపూర్ క్రెడిట్ కార్డ్ దుర్వినియోగానికి గురైంది. ఆ కార్డు నుంచి రూ. 3.82 లక్షలను గుర్తు తెలియని వ్యక్తి చోరీ చేశాడు. దీనిని గుర్తించిన బోనీ కపూర్.. తన సహాయకుడి ద్వారా అంబోలీ పీఎస్ లో ఫిర్యాదు చేయించాడు. IPC, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశారు. 2022, ఫిబ్రవరి 09వ తేదీన ఆన్ లైన్ ద్వారా ఐదు లావాదేవీలను క్రెడిట్ ద్వారా ఉపయోగించడాని పోలీసులు గుర్తించారు. క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపు కోసం మార్చి 30వ తేదీన ఫోన్ చేయడంతో మోసాన్ని బోనీ కపూర్ గుర్తించినట్లు ఫిర్యాదుదారుడు పోలీసులకు తెలిపాడు. డబ్బు విత్ డ్రా అయ్యిందని తెలుసుకున్న అనంతరం సంబంధిత బ్యాంకులో ఆరా తీయడం జరిగిందన్నాడు.

క్రెడిట్ కార్డు వివరాలను ఎవరూ అడగలేదని, దీనికి సంబంధించి ఎలాంటి ఫోన్ రాలేదని అతను చెప్పాడు. గురుగ్రామ్ లోని ఓ కంపెనీ ఖాతాకు డబ్బు చేరినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. విచారణ ప్రారంభించినట్లు.. నిందితులను పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నామని అంబోలీ పీఎస్ అధికారి తెలిపారు.  బోనీ కపూర్ పలు చిత్రాలను నిర్మించాడు. మిస్టర్ ఇండియా, నో ఎంట్రీ, జుదాయి, వాంటెడ్ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. 2018లో నటి శ్రీదేవిని వివాహం చేసుకున్నారు. నటి శ్రీదేవి ఎన్నో చిత్రాల్లో నటించారు. 2018, ఫిబ్రవరి 24వ తేదీన ఈమె మరణించారు. నటుడు అనీల్ కపూర్, సంజయ్ కపూర్ లు సోదరులు. బోనీ కపూర్ కు ఖుషీ కపూర్, జాన్వీ కపూర్‌, అర్జున్ కపూర్, అన్షులా కపూర్‌ పిల్లలున్నారు. 

మరిన్ని వార్తల కోసం : -

ఎన్టీఆర్ ఒక ప్రభంజనం..ఒక సంచలనం


NBK107 మాస్ పోస్టర్ రిలీజ్