మార్చి16న వైసీపీ ఫైనల్ లిస్టు.. 18 నుంచి జగన్ ప్రచారం

మార్చి16న వైసీపీ ఫైనల్ లిస్టు.. 18 నుంచి జగన్ ప్రచారం

రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు సిద్ధం సభలతో వైసీపీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన సీఎం జగన్.. పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 16న ఇడుపులపాయలో 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ  అభ్యర్థుల జాబితాను ఆయన విడుదల చేయనున్నారు. మార్చి18న గోదావరి జిల్లాల నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. 

రోజుకు 3నుంచి-4 నియోజకవర్గాల్లో బహిరంగసభలు, రోడ్ షోలు నిర్వహించేలా రూట్ మ్యాప్‌ను రెడీ చేస్తున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల సమయంలోనూ ఇడుపులపాయ నుంచే అభ్యర్థుల లిస్ట్‌ను జగన్ ప్రకటించారు. మరోసారి సెంటిమెంట్ గా అక్కడినే అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు అని తెలుస్తోంది. 

మరోవైపు  అసంతృప్త నేతలను బుజ్జగించే పనిలో సీఎం జగన్‌ ఉన్నారు. నగరి, సత్తెనపల్లి, నసరావుపేట తదితర నియోజకవర్గాల్లో నేతల మధ్య విభేదాలు తారస్థాయికి చేరడంతో స్థానిక నేతలతో చర్చిస్తున్నారు. కాగా రానున్న  సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా..  టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేస్తు్న్న సంగతి తెలిసిందే.