ఎయిమ్స్​లో చేరిన నిర్మలా సీతారామన్

ఎయిమ్స్​లో చేరిన నిర్మలా సీతారామన్

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి​ నిర్మలా సీతారామన్‌‌ కడుపు నొప్పి​తో ఢిల్లీలోని ఆల్‌‌ ఇండియా ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ మెడికల్‌‌ సైన్సెస్‌‌ (ఎయిమ్స్‌‌)లో చేరారు. జ్వరం కూడా ఉండడంతో ఆమెను సోమవారం మధ్యాహ్నం ఎయిమ్స్​లోని ప్రైవేట్‌‌ వార్డులో చేర్చారు. డాక్టర్లు మంత్రికి అన్ని టెస్టులు చేశారు. వాటి రిపోర్టులు రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిసింది.