సన్న బియ్యం ఇస్తున్నది ఒక్క తెలంగాణలోనే : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

సన్న బియ్యం ఇస్తున్నది ఒక్క తెలంగాణలోనే :  పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
  •     చిట్ చాట్​లో కేంద్రంపై మహేశ్​ గౌడ్ విమర్శలు

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ సన్న బియ్యం అందించడం లేదని, తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అన్నారు. సోమవారం సీఎల్పీలో మీడియాతో ఆయన చిట్‌‌చాట్‌‌ చేశారు. 

రాహుల్ గాంధీ ఆకాంక్ష మేరకు గిగ్ వర్కర్ల బిల్లుకు ప్రభుత్వం ఆమోదం తెలపడం చరిత్రాత్మకమని అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తన దారుణమన్నారు.  కేవలం కేటీఆర్ దృష్టిలో పడాలనే ఉద్దేశంతో ఆయన వ్యవహరిస్తున్న తీరు తీవ్ర ఆక్షేపణీయమని విమర్శించారు.