అన్ని రకాల చెల్లింపులకు భారత్​పే వన్​

అన్ని రకాల చెల్లింపులకు భారత్​పే వన్​

హైదరాబాద్​, వెలుగు:  ఫిన్‌‌‌‌టెక్ కంపెనీ భారత్‌‌‌‌పే.. పీఓఎస్, క్యూఆర్  స్పీకర్లను ఒకే పరికరంలోకి అనుసంధానించే భారతదేశపు మొట్టమొదటి ఆల్-ఇన్-వన్ పేమెంట్​పరికరం అయిన భారత్‌‌‌‌పే వన్‌‌‌‌ను విడుదల చేసింది. ఈ వినూత్న ఉత్పత్తి వ్యాపారుల కోసం లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి రూపొందించామని తెలిపింది.  

యూపీఐ, డెబిట్,  క్రెడిట్ కార్డ్‌‌‌‌తోపాటు డైనమిక్,  స్టాటిక్ క్యూ ఆర్ కోడ్, ట్యాప్-అండ్-పే వంటి అన్ని రకాల పేమెంట్స్​ను ఇది తీసుకుంటుంది. మొదటి దశలో 100కుపైగా నగరాల్లో ఈ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఆ తరువాత 6 నెలల్లో 450కుపైగా నగరాలకు విస్తరించనుంది.