హైదరాబాద్, వెలుగు: ఫిన్టెక్ కంపెనీ భారత్పే.. పీఓఎస్, క్యూఆర్ స్పీకర్లను ఒకే పరికరంలోకి అనుసంధానించే భారతదేశపు మొట్టమొదటి ఆల్-ఇన్-వన్ పేమెంట్పరికరం అయిన భారత్పే వన్ను విడుదల చేసింది. ఈ వినూత్న ఉత్పత్తి వ్యాపారుల కోసం లావాదేవీలను క్రమబద్ధీకరించడానికి రూపొందించామని తెలిపింది.
యూపీఐ, డెబిట్, క్రెడిట్ కార్డ్తోపాటు డైనమిక్, స్టాటిక్ క్యూ ఆర్ కోడ్, ట్యాప్-అండ్-పే వంటి అన్ని రకాల పేమెంట్స్ను ఇది తీసుకుంటుంది. మొదటి దశలో 100కుపైగా నగరాల్లో ఈ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. ఆ తరువాత 6 నెలల్లో 450కుపైగా నగరాలకు విస్తరించనుంది.