అరోరా ఫార్మాస్యూటికల్స్‌లో అగ్ని ప్రమాదం

అరోరా ఫార్మాస్యూటికల్స్‌లో అగ్ని ప్రమాదం

రంగారెడ్డి జిల్లా కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని అరోరా ఫార్మాస్యూటికల్స్  ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈప్రమాదంలో రియాక్టర్ పేలి ఇద్దరు మృతి చెందారు. కెమికల్ ల్యాబ్ లో పని చేస్తుండగా రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ సమయంలో ల్యాబ్ లో పనిచేస్తున్న రవీందర్ రెడ్డి(25), కుమార్(24) అనే ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. అనంతరం వారి మృతదేహాలను ఉస్మానియాకు తరలించారు. ఈ ఘటనపై జీడిమెట్ల ఫైర్ డిపార్ట్మెంట్ వివరాలు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు.