
జోగిపేట, వెలుగు: అందోల్ మండలం సంగుపేట గ్రామ శివారులోని కటుకం వేణుగోపాల్ అండ్ సన్స్ హోల్ సేల్ అండ్ రిటైల్ టపాసుల గోదాం దగ్గర శనివారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాం ముందు పటాకుల షాప్ఏర్పాటు చేసి విక్రయిస్తుండగా కౌంటర్ ముందు ఉన్న విద్యుత్మీటర్ వద్ద షార్ట్ సర్క్యూట్ కావడంతో అగ్ని ప్రమాదం సంభవించింది. దీంతో గోదాం ముందు విక్రయానికి ఉంచిన పటాకులన్నీ కాలిపోయాయి.
పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో కొనుగోలుదారులు భయంలో బయటకు పరుగులు తీశారు. జిల్లా అగ్నిమాపకశాఖ అధికారి నాగేశ్వర్రావు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. జోగిపేట ఫైర్ఆఫీసర్ శ్రీనివాస్గౌడ్ ఆధ్వర్యంలో మంటలను ఆర్పారు. గోదాంకు ఎటువంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్తపడ్డారు. ఘటనా స్థలాన్ని తహసీల్దార్మధుకర్రెడ్డి సందర్శించి పెద్ద మొత్తంలో సరుకు కాలిపోయిందని అంచనా వేశారు. సరైన సేఫ్టీ ప్రికాషన్స్ పాటించకపోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు చెప్పారు.