సంగారెడ్డిలో అగ్నిప్రమాదం.. పత్తి మిల్లులో చెలరేగిన మంటలు..కాలి బూడిదైన పత్తి బేళ్లు

సంగారెడ్డిలో అగ్నిప్రమాదం.. పత్తి మిల్లులో చెలరేగిన మంటలు..కాలి బూడిదైన  పత్తి బేళ్లు

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలం తుర్కవాడగామలోని సమర్థ్ కోటెక్స్ పత్తి మిల్లులో మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం (డిసెంబర్ 21) తెల్లవారు జామున  మిల్లులో గోడౌన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి పత్తి బేళ్లు కాలి బూడిదయ్యాయి.  ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. ఫైరింజన్లతో మంటలార్పేందుకు శ్రమించారు. గోడౌన్  నిండా పత్తి ఉండటంతో భారీ నష్టం వాటిల్లింది.  ప్రమాదానికి గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.