జూబ్లీహిల్స్, వెలుగు: సెకండ్హ్యాండ్కార్ల షోరూంలో మంటలు చెలరేగి, 22 కార్లు దగ్ధమయ్యాయి. ఈ ఘటన జూబ్లీహిల్స్పోలీస్స్టేషన్పరిధిలోని శ్రీనగర్కాలనీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్కాలనీలోని గణపతి కాంప్లెక్స్ఎదురుగా నాని అనే వ్యక్తి కొన్నేండ్లుగా సెకండ్హ్యాండ్కార్ల షోరూం నడుపుతున్నాడు. అందులో పనిచేసే అంజాద్అనే వ్యక్తి రోజూలాగే సోమవారం రాత్రి షోరూం క్లోజ్చేసి ఇంటికి వెళ్లాడు.
అర్ధరాత్రి తర్వాత ఓ కారులో మంటలు చెలరేగి, పక్కనే ఉన్న కార్లకు అంటుకున్నాయి. స్థానికులు గమనించి ఫైర్స్టేషన్కు కాల్చేసి చెప్పారు. రెండు ఫైర్ఇంజిన్లతో ఫైర్సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే 22 కార్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదానికి కారణం తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.